కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఐశ్వర్య హోమ్స్ బిల్డర్స్ యజమాని మంతం మధు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. వారం రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరగ్గా, పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు మంతం మధు శుక్రవారం బహుమతులు అందించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినందుకు గ్రామ ప్రజలు, గ్రామ యువకులు ఐశ్వర్య హోమ్స్ బిల్డర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూన లత సాగర్ ఉప సర్పంచ్ తరిగొప్పుల చిరంజీవి, గ్రామ యువకులు పాల్గొన్నారు.

