epaper
Friday, January 23, 2026
spot_img
epaper

ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

కలం, వెబ్​డెస్క్​: ఏపీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో వైఎస్సార్​సీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు  కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసులో విజయసాయి రెడ్డిని ఏ5గా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) పేర్కొంది. సిట్​ దర్యాప్తులో మనీలాండరింగ్​ వ్యవహారాలు బయటపడడంతో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ED)​ రంగంలోకి దిగింది. గతేడాది మేలో ఈడీ  దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలు నిందితులను విచారించింది. ఇందులో భాగంగా విజయసాయి రెడ్డి గురువారం ఈడీ బృందం ఎదుట హాజరయ్యారు. ఆయన నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

కాగా, మద్యం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సిట్​ అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో వైఎస్సార్​సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అలాగే ఎంపీ మిథున్​రెడ్డి అరెస్టై, ప్రస్తుతం బెయిల్​ మీద బయటికొచ్చారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) విచారణకు హాజరవడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో మద్యం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును గత ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి నేతలు అంటున్నారు.

Read Also:  త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>