కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వల్ల.. ఇండియా వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తులు, మార్కెట్ ను అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఆయా శాఖల అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు గ్యాస్ సంక్షోభం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు మూత పడుతున్నాయి. అనేక రంగాల్లో గ్యాస్ కొరత వల్ల ఉత్పత్తులు ఆగిపోతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ ఉత్పత్తులను 20 శాతం పెంచినట్టు ప్రకటించింది.

