epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

తెలంగాణలో 23 మందికి విశిష్ట సేవా పతకాలు..

కలం, వెబ్​ డెస్క్ : 2026 గణతంత్య్ర దినోత్సవం (Republic Day 2026) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, రక్షణ సేవలకు సంబంధించి విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. దేశం మొత్తం 125 మందికి గ్యాలంటరీ అవార్డులు, 101 మందికి ప్రెసిడెంట్ మెడల్స్​ దక్కగా.. 756 మందికి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణలో ఉత్తమ సేవలు అందించి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్న వారిలో 23 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరిలో ఏసీపీ మంద జీ.ఎస్​ ప్రకాశ్​ రావు, ఎస్​ఐ అన్ను దామోదర్​ రెడ్డిలకు ప్రెసిడెంట్ మెడల్ దక్కగా.. హెడ్​ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. మరో 20 మంది పోలీసు అధికారులు విశిష్ట సేవా పథకాలు అందుకోనున్నారు.

Read Also: ప‌ద్మశ్రీ అవార్డులు ప్ర‌క‌టించిన కేంద్రం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>