నాంప‌ల్లి అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మూడు మృత‌దేహాలు గుర్తింపు

క‌లం, వెబ్ డెస్క్: నాంప‌ల్లి(Nampally) అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో 18 గంట‌ల సుధీర్ఘ ప్ర‌య‌త్నం అనంత‌రం రెస్క్యూ టీం(Rescue team) సెల్లార్‌లోకి చేరుకుంది. ఈ క్ర‌మంలో సెల్లార్‌లో మూడు మృత దేహాల‌ను గుర్తించారు. స‌ద‌రు మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు త‌ర‌లించారు. ఇందులో ఒక మృత‌దేహం మంటల్లో చిక్కుకున్న బేబీ అనే మహిళగా గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో మొత్తం ఐదుగురు మంట‌ల్లో చిక్కుకున్నారు. వీరిలో ఇద్ద‌రు చిన్నారులున్నారు. రెస్క్యూ టీం గుర్తించిన మృత‌దేహాలు ఎవ‌రివి అన్న‌ది తెలియాల్సి ఉంది. 200 మంది సిబ్బందితో రెస్య్కూ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>