epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

జనగామ జిల్లాలో తొలిసారిగా ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్

కలం, జనగామ: వేధింపులు, దాడులకు గురయ్యే మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసేందుకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనగామ (Jangaon) జిల్లాలో తొలిసారిగా పోలీసులు బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. జాఫర్‌గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. జాఫర్‌గఢ్ గ్రామంలో కొందరు వ్యక్తులు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమస్యను చెప్పుకుంది. ఎస్ఐ బి.రామారావు మహిళ ఇంటికి వెళ్లి ఫిర్యాదును స్వీకరించి, అక్కడే కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>