epaper
Monday, January 26, 2026
spot_img
epaper

అమరావతిలో తొలి రిపబ్లిక్ డే.. వేడుకల్లో గవర్నర్​, సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్​ : 77వ రిపబ్లిక్​ డే వేడుకలు (Republic Day) దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) లో తొలిసారిగా గణతంత్ర వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాయపూడిలో గవర్నర్​ అబ్దుల్​ నజీర్​ (Governor Abdul Nazeer)​ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ ఘనస్వాతం పలికారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన పరేడ్​ గవర్నర్​ 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

కాగా, రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న రిపబ్లిక్​ వేడుకలకు అమరావతి రైతులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. రైతులకు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. రాయపూడి సీడ్ యాక్సిస్​ రోడ్డు పక్కన 22 ఎకరాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 13వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>