epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధం : భట్టి విక్రమార్క

కలం, వెబ్ డెస్క్​ : సింగరేణి టెండర్ల (Singareni Tenders)పై తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్​ రెడ్డి రాగానే విచారణను కోరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలో భట్టి స్పందించారు. శనివారం జ్యోతిబాపూలే ప్రజా భవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణి ఆధ్వర్యంలో తాడిచెర్ల మొదలు తాజాగా టెండర్ వరకు అన్నింటి పై దర్యాప్తు జరగాలన్నారు.

సృజన్​ రెడ్డితో సీఎం రేవంత్​ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు భట్టి విక్రమార్క. బీఆర్​ఎస్ మనిషి కందాల ఉపేందర్​ రెడ్డి కూతురు భర్తే సృజన్​ రెడ్డి అని భట్టి వివరించారు. సీఎం రేవంత్​ రెడ్డి అమెరికా నుంచి రాగానే చర్చించుకుంటామన్నారు. కానీ, మధ్యలో సింగరేణి సంస్థను ఎందుకు బలి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై ఏ గద్దలనూ, రాబందులను వాలనివ్వనని భట్టి స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధంగా ఉన్నామని, హరీష్‌రావు లేఖ రాయాలనుకుంటే తనకు రాయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు.

Read Also: ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>