epaper
Friday, January 23, 2026
spot_img
epaper

భూముల రీసర్వేపైనా చంద్రబాబు క్రెడిట్​ చోరీ : వైఎస్​ జగన్​

కలం, వెబ్​డెస్క్​: భూముల రీసర్వేపైనా సీఎం చంద్రబాబు (Chandrababu) క్రెడిట్​ చోరీ చేస్తున్నారని వైఎస్సార్​సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి (YS Jagan) ఆరోపించారు. గురువారం తాడేపల్లిలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేసిన ప్రతి పనినీ తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్​ చోరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడుతున్నారని వైఎస్​ జగన్​ అన్నారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయంతోపాటు తాము తెచ్చిన అనేక ప్రాజెక్టులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. ఇదే కోవలో ఇప్పుడు భూముల రీసర్వేపైనా క్రెడిట్​ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది మేం చేసిన మహాయజ్ఞం..

భూముల రీసర్వే అనేది వైఎస్సార్​సీపీ హయాంలో తాము మొదలుపెట్టామన్నామని వైఎస్​ జగన్​  అన్నారు. దీనికోసం సచివాలయాలు ఏర్పాటుచేసి, వేల సిబ్బందిని నియమించి ప్రక్రియ ప్రారంభించామన్నారు. రీసర్వే పూర్తి చేయడానికి సర్వే ఆఫ్​ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. యూరప్​లో వాడుతున్న లేటెస్ట్​ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో నిరంతర ఆపరేటింగ్​ను ఏర్పాటుచేసి, పర్యవేక్షించామన్నారు. గ్లోబల్​ నేవిగేషన్​ సిస్టమ్​ రిసీవర్స్​ వాడామన్నారు. 2 విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్​ డ్రోన్స్​ ఉపయోగించామన్నారు. రీసర్వేపై పూర్తి అవగాహన కోసం సిబ్బందికి 70కి పైగా ట్రైనింగ్​ ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలను తరలించామన్నారు.

‘శాశ్వత భూ రక్ష.. భూ హక్కు’ పేరుతో తాము చేసిన భూముల రీసర్వే చరిత్రాత్మకమన్నారు. ఈ విధానంలో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు వేసినట్లు చెప్పారు. మీభూమి పోర్టల్​ను కూడా అన్ని వివరాలతో అప్​గ్రేడ్​ చేశామన్నారు. కోట్ల సర్వే రాళ్లను పాతామన్నారు. తాము చేసింది మహాయజ్ఞమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీకి వచ్చి రీ సర్వేపై అధ్యయనం చేశాయన్నారు. ఈ సందర్భంగా భూముల రీసర్వేకు తాము చేసిన కార్యక్రమాలను వీడియోలు, క్లిప్లింగ్స్​ ద్వారా ప్రదర్శించారు.

తాము ఇంత గొప్ప పనిచేస్తే.. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. తీరా అబద్ధాలతో అధికారంలోకి వచ్చాక, భూముల రీసర్వేను తన ఖాతాలో వేసుకుంటున్నారని, చంద్రబాబుకు సిగ్గుండాలని వైఎస్​ జగన్​ దుయ్యబట్టారు. సర్వే అంటే ఏంటో కూడా చంద్రబాబుకు తెలియదని జగన్ (YS Jagan)​ ఎద్దేవా చేశారు.

Read Also:  ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>