భర్తపై కోపం.. కోట్లు వెదజల్లిన మహిళ, వైరల్ వీడియో.. !

కలం, వెబ్ డెస్క్ : భర్తపై ఆగ్రహించిన ఓ మహిళ నోట్ల కట్టలను రోడ్డు మీదకు విసేరిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది. భర్తతో గొడవతో కోపానికి గురైన మహిళ బాల్కానీ నుంచి సుమారు రూ.1.5 కోట్లు విలువైన నగదును బయటకు విసిరేసింది. ఈ షాకింగ్ ఘటన గ్వాంగ్‌డాంగ్ లోని శాంతౌ నగరంలో జరిగింది.

ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఆ డబ్బును తీసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ ఆ నగదు అసలైనదేనని ధృవీకరించింది. తీసుకున్న వారు డబ్బులను తిరిగి ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read Also: మొదటి సంతకానికే హైడ్రాను ఎత్తిపడేస్తా: కేసీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>