యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ను ఢీకొట్టిన లారీ

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి (Yadadri) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు (Kondamadugu Mettu) వద్ద ఆగివున్న టిప్పర్ ను వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ప్రమాద దాటికి లారీ డ్రైవర్ కాలు తెగి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను రెండు గంటల పాటు శ్రమించి పోలీసులు బయటికి తీశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>