కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (ORR Accident) చోటు చేసుకున్నది. శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు చేస్తున్నారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు
Follow Us On: Instagram

