కలం, వెబ్డెస్క్: శబరిమల గోల్డ్ స్కామ్ (Sabarimala Gold Scam) కేసులో మరో ఆసక్తికరణ పరిణామం. ఈ కేసులో యాక్టర్ జయరామ్ను సిట్ అధికారులు విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నైలోని జయరామ్ స్వగృహంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో గల సంబంధాలపై వివరాలు రాబట్టారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాలను మరమ్మతు కోసం చెన్నైకి తీసుకొచ్చిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. జయరామ్ స్వగృహంలో జరిగిన పూజల్లో ఆ తాపడాలను వాడినట్లు ఇటీవల ఓ వీడియో బయపటపడింది. దీంతో ఈ కేసులో సిట్ జయరామ్ను విచారించినట్లు తెలుస్తోంది.
కాగా, శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోని బంగారు తాపడాలను మరమ్మతుల కోసమంటూ ఉన్నికృష్ణన్ పొట్టి 2019లో చెన్నైలోని ఓ కంపెనీకి అప్పగించారు. అనంతరం తిరిగి వాటిని ఆలయానికి తీసుకెళ్లారు. అయితే, మరమ్మతులకు తీసుకెళ్లి, తెచ్చాక వాటి బరువులో సుమారు 4కిలోల మేర తగ్గినట్లు ఆలయ అధికారులు గుర్తించి కేసు పెట్టారు (Sabarimala Gold Scam). ఇది కేరళలో సంచనలంగా మారింది.
ఈ కేసులో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కేరళ హైకోర్టు సిట్ను నియమించింది. ఇప్పటివరకు ఈ కేసులో సిట్ అధికారులు ప్రధాన నిందితునితోపాటు ఆలయ పూజారిని, మరో 14 మందిని అరెస్టు చేశారు.


