కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ తన 11వ సీజన్కు (PSL Season 11) ముందు ఆటగాళ్ల ఎంపిక విధానంలో కీలక మార్పు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానాన్ని అనుసరించిన PSL ఈసారి డ్రాఫ్ట్ వేలం కలయికగా ఉండే డ్రాక్షన్ మోడల్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. హైదరాబాద్, సియాల్కోట్ నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరడంతో ఈ అంశంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ఈ ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో సమావేశాన్ని వాయిదా వేసి మరింత చర్చ కోసం వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు.
కొత్త జట్లు తక్కువ సంఖ్యలో ఆటగాళ్ల నిలుపుదల ఉండాలని పూర్తి స్థాయి వేలం విధానం అమలులోకి రావాలని కోరుతున్నాయి. ఇలా చేస్తే బలమైన జట్లు నిర్మించుకునే అవకాశం లభిస్తుందని వారి అభిప్రాయం. ఇప్పటికే ఉన్న చాలా ఫ్రాంచైజీలు మాత్రం డ్రాఫ్ట్ విధానమే లీగ్లో సమతుల్యత స్థిరత్వం తీసుకొచ్చిందని భావిస్తూ అదే కొనసాగాలని కోరుతున్నాయి. ఈ సమావేశంలో PSL షెడ్యూల్ ఆటగాళ్ల నిలుపుదల డ్రాక్షన్ విధానం నేరుగా ఆటగాళ్ల సైనింగ్ అంశాలపై చర్చ జరిగింది. PSL మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించారు. తుది నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉంది.

Read Also: భారత క్రికెట్ జట్టు ఎంపికపై కైఫ్ అసహనం
Follow Us On: X(Twitter)


