epaper
Friday, January 30, 2026
spot_img
epaper

స్వదేశీ సూత్రం దేశాభివృద్ధికి మూల స్తంభం: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: గాంధీజీ (Mahatma Gandhi) చెప్పిన స్వదేశీ సూత్రం దేశాభివృద్ధికి మూల స్తంభమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మా గాంధీజీ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని రాజ్​ఘాట్​లో ఉన్న బాపూజీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అంతకుముందు ‘ఎక్స్​’ వేదికగా మహాత్మునికి నివాళి అర్పిస్తూ ట్వీట్​ చేశారు. అలాగే ఇదే రోజు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నందున దేశాభివృద్ధిలో వాళ్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

‘జాతిపిత మహాత్మా గాంధీజీ పుణ్య తిథి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. ఆయన వ్యక్తిత్వం, ఆదర్శాలు ఈ దేశ ప్రజలను ఎప్పటికీ నడిపిస్తూనే ఉంటాయి. దేశ సర్వతోముఖావృద్ధికి స్వదేశీ సూత్రం ద్వారా గాంధీజీ బలమైన పునాది వేశారు. ఇది దేశ స్వావలంబన, అభివృద్ధికి మూలస్తంభం వంటిది’ అని ప్రధాని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రం కోసం, దేశాభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ, వారి సేవలను ట్వీట్​లో ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.

కాగా, రాజ్​ఘాట్​ వద్ద మహాత్మునికి (Mahatma Gandhi) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​, స్పీకర్​ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్​ నేతలు నివాళి అర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>