epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

పాకిస్థాన్​లో తిరిగి తెరుచుకున్న లవుని ఆలయం

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్​లోని (Pakistan) లాహోర్​ కోటలో ఉన్న లవుని ఆలయాన్ని (Loh Temple) పాక్​ ప్రభుత్వం మంగళవారం తిరిగి తెరిచింది. పురాతనమైన ఈ ఆలయం సరైన నిర్వహణ లేక పాడుబడడంతో కొంతకాలం కిందట పునరుద్ధరణ పనుల కోసం మూసివేసింది. ప్రస్తుతం పనులన్నీ పూర్తవడంతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనితోపాటు సిక్కు యుగానికి చెందిన​ హమ్మామ్ కట్టడం​, మహారాజా రంజిత్​ సింగ్​కు చెందిన అత్​ దారా ప్రాంగణాన్ని ​కూడా పున:ప్రారంభించారు. లవ ఆలయంతోపాటు ఈ కట్టడాలను పాక్​ ప్రభుత్వంతో కలసి ఆఘా ఖాన్​ కల్చరల్ సొసైటీ పునరుద్ధరించింది.

శ్రీరాముని పుత్రులయిన లవకుశుల్లో ఒకరైన లవుడు లాహోర్​ను నిర్మించినట్లు చెపుతారు. అందుకే ఆయన పేరు మీదుగా ఈ సిటీకి లాహోర్​ అనే పేరు వచ్చిందని హిందువుల నమ్మకం. దీనికి నిదర్శనంగా చెప్పే వాటిలో లవుని ఆలయం ఒకటి. ఇది లాహోర్​ కోట లోపల, నాలుగు చిన్న ద్వారాలున్న గర్బగుడిలా ఉంటుంది. కాలక్రమంలో ఈ గుడి పేరు లోహ్​ టెంపుల్​గా (Loh Temple) మారింది. కాగా, లాహోర్​ కోట (Lahore Fort) సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వాల్డ్​ సిటీ లాహోర్​ అథారిటీ ఈ నగరంలోని అనేక హిందూ ఆలయాలు, కట్టడాలు, స్మారక చిహ్నాలు పరిరక్షిస్తోంది.

Read Also: హార్ట్ టచింగ్ వీడియో.. యజమాని మృతి, 4 రోజులు కాపలా కాసిన కుక్క!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>