epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ఐసీసీ వార్నింగ్​.. టీమ్ ను ప్రకటించిన పాకిస్తాన్​

కలం, వెబ్​ డెస్క్​ : టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) టోర్నమెంట్​ కు పాకిస్తాన్ క్రికెట్​ బోర్డ్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్​ ప్రపంచ కప్​ నుంచి వైదొలిగిన క్రమంలో పీసీబీ చైర్మన్​ మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్​ ఆడకపోతే తాము కూడా టోర్నమెంట్​ ను బాయ్ కాట్ చేస్తామని వ్యాఖ్యానించాడు. బంగ్లాకు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. నఖ్వీ (Mohsin Raza Naqvi) వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ క్రికెట్​ సంఘం (ICC) పాకిస్తాన్​ క్రికెట్​ బోర్డుపై ఆంక్షులు విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ తరుణంలో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే పొట్టి క్రికెట్ ప్రపంచకప్​ కు జట్టును ప్రకటించడం గమనార్హం. ఐసీసీ వార్నింగ్​ తోనే పాకిస్తాన్​ దిగివచ్చిందని స్పోర్ట్స్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: ప‌ద్మశ్రీ అవార్డులు ప్ర‌క‌టించిన కేంద్రం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>