కలం, వరంగల్ బ్యూరో : గతంలో వరంగల్ అభివృద్ధిపై హామీలు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ (KCR) మాట తప్పారని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (MLA Nagaraju) విమర్శించారు. ప్రజలు ఇక వారి మాయమాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ఓరుగల్లు ప్రజలు చైతన్యవంతులని, డ్రామాలతో మోసగించలేరని కేటీఆర్పై ఎమ్మెల్యే నాగరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు సదస్సుపై స్పందిస్తూ ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
Read Also: మరికాసేపట్లో సీఎంతో ఉద్యోగ జేఏసీ భేటీ
Follow Us On: Instagram

