కలం, స్పోర్ట్స్ : ఐజీపీఎల్ భారత్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నమెంట్లో భారత స్టార్ గోల్ఫర్ కరన్దీప్ కొచ్చర్ (Karandeep Kochhar) సరికొత్త రికార్డు వైపు దూసుకెళ్తున్నారు. తీవ్రమైన ఈదురు గాలుల సవాల్ను ఎదుర్కొంటూ, 7-అండర్ స్కోరుతో భారత ఆటగాళ్లందరిలోనూ ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతానికి ఆయన టోర్నమెంట్లో పదో స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు థాయిలాండ్కు చెందిన శెట్టి ప్రకోంగ్వెచ్ 13-అండర్ స్కోరుతో ఓవరాల్ లీడర్గా నిలిచారు.
ఈ టోర్నమెంట్లో థాయిలాండ్ ఆటగాడు శెట్టి ఎలాంటి తప్పులు లేకుండా నాలుగు బర్డీలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన వెనుకే రంచనాపాంగ్, స్వీడన్ ఆటగాడు చార్లీ లింధ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన చార్లెస్ పోర్టర్ కూడా అద్భుతమైన ఆటతో పైకి దూసుకొచ్చారు. చండీగఢ్కు చెందిన కరన్దీప్ కొచ్చర్ (Karandeep Kochhar) ఆరంభంలో రెండు బర్డీలతో రాణించారు. ఆ తర్వాత కొన్ని మంచి అవకాశాలు చేజారినప్పటికీ, 16వ హోల్లో మరో బర్డీతో పుంజుకున్నారు. లక్ కలిసిరాకపోయినా ఈ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని, తదుపరి రౌండ్లో మరింత మెరుగైన స్కోరుతో ముగిస్తానని కొచ్చర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు మిగతా భారత ఆటగాళ్లు గగన్జీత్ సింగ్ భుల్లర్, పుఖ్రాజ్ సింగ్ గిల్ చెరో 69 స్కోరుతో 36వ స్థానానికి ఎగబాకారు. వీరితో పాటు యశస్ చంద్ర, రాఘవ్ చుగ్, రషీద్ ఖాన్ కూడా 36వ స్థానంలో నిలిచారు. అయితే, రేసులో ముందున్న కార్తీక్ సింగ్ మాత్రం స్కోరు తగ్గడంతో కిందకి పడిపోయారు. శౌర్య భట్టాచార్య 49వ స్థానంలో నిలిచారు.
Read Also: వరల్డ్కప్ మిషన్పై హర్మన్ప్రీత్ ఫోకస్.. ఒత్తిడికి చెక్
Follow Us On: Instagram

