epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

దారుణం.. కూతురుని చంపి కుటుంబం ఆత్మహత్యాయత్నం

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ లో దారుణం చోటుచేసుకుంది. అప్పుల భారం తట్టుకోలేక పుట్టుకతో అంగవైకల్యంతో ఉన్న కూతరును చంపి (Parents Kill Daughter) ఆపై కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అల్విన్​ కాలనీ జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని విజయనగర్​ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆయన భార్య, కుమారుడు నితిన్ కుమార్, కుమార్తె శ్రీ జావలి కుటుంబ సభ్యలు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకతో వికలాంగురాలైన కుమార్తె శ్రీ జావలిని చంపి.. ఆ తర్వాత భర్త, భార్య, కుమారుడు చేతులు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.

Parents Kill Daughter | అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు దాటినా వారు మరణించకపోవడంతో.. కుమారుడు నితిన్ తన స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తక్షణమే స్పందించి కుటుంబ సభ్యులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరణించిన శ్రీ జావలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>