కలం, వెబ్ డెస్క్ : నల్గగొండ (Nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్ పల్లి గేట్ దగ్గర ఈ జరిగిన యాక్సిడెంట్ లో ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకుని దర్యాప్తు చేపట్టారు.

