epaper
Monday, January 26, 2026
spot_img
epaper

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్ స‌న్మానం

కలం, వెబ్​ డెస్క్​: ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారిని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు. ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు నోరి ద‌త్తాత్రేయుడుకు ప‌ద్మ భూష‌ణ్‌తో పాటు విభిన్న రంగాల్లో సేవ‌లందించిన వారికి ప‌ద్మ‌శ్రీ అవార్డులు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న ముగించుకొని రాష్ట్రానికి వ‌చ్చిన త‌ర్వాత ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారిని ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు. గ‌తంలో ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రప‌తి ఎం.వెంక‌య్య నాయుడు, ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవితో పాటు ఇత‌రుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వ‌ర్యంలో శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా స‌న్మానించారు. అదే మాదిరి ఈ ఏడాది కూడా ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారిని స‌న్మానించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>