కలం, డెస్క్ : కుప్పంలో ఈ-సైకిళ్ల పంపిణీతో చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 5555 ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. శివపురం నుంచి ప్రజావేదిక దాకా ఈ-సైకిళ్లపై ర్యాలీ చేపట్టారు సీఎం చంద్రబాబు . దాదాపు 3 కిలోమీటర్ల దాకా సైకిల్ తొక్కుతూ వచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కుప్పం నుంచే ఏపీలో తాము చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఈ వెహికల్స్ వినియోగంలో ఏపీ అందరికంటే ముందు వరుసలో ఉండాలని కోరారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే కుప్పంలో 5555 ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించామని తెలిపారు. గిన్నీస్ రికార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అందుకున్నారు.

Read Also: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం..!
Follow Us On : WhatsApp


