కలం, వెబ్ డెస్క్: బండి భగీరథ్కు జారీ చేయాల్సిన నోటీసులను అతని మేనమామకు అందజేయడంపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోక్సో (POCSO) కేసులో ఐదు రోజులుగా పరారీలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన నోటీసులను మధ్యలో ఉన్న మేనమామకు ఏ ప్రాతిపదికన ఇస్తారని ఆయన ప్రశ్నించారు. భగీరథ్ తండ్రి బండి సంజయ్ నిన్ననే కరీంనగర్లో ఒక యాత్రలో పాల్గొన్నప్పుడు, పోలీసులకు ఆయన అందుబాటులోనే ఉన్నా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని నిలదీశారు. నిందితుడు అందుబాటులో లేనప్పుడు అతని బంధువులకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో ఉందో రాష్ట్ర డీజీపీ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Read Also: హరీశ్ రావు ఆధ్యాత్మిక బాట వెనుక ఆంతర్యమేమిటి!
Follow Us On: Pinterest

