కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి వరాల జల్లు కురిపించింది. రూ.1299 కోట్లతో సీజీఓ (CGO) కాంప్టెక్స్ భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చతురస్రాకారంలో నిర్మించే కాంప్లెక్స్ లో కేంద్ర కార్యాలయాలన్ని ఒకే చోట ఉంటాయి. అలాగే, రూ.1234 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గృహ సముదాయాల నిర్మాణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా, సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు. ఈ క్రమంలోనే మోదీని అభినందిస్తూ మంత్రివర్గం ఏకవాక్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
Read Also: రౌడీలతో నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ.ఆనంద్
Follow Us On: X(Twitter)

