రాహుల్ స్థానంలో కూర్చోవాలని రేవంత్​ ఉబలాట : బండి సంజయ్​

కలం, వెబ్ డెస్క్​ : డీలిమిటేషన్ పై​ దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి.. రాహుల్​ గాంధీ స్థానంలో కూర్చోవాలని ఉబలాటపడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్​ (Bandi Sanjay)​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన అంబేద్కర్​​ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో సీఎం రేవంత్​ ప్రతిపాదనపై బండి కౌంటర్​ ఇచ్చారు. జీడీపీ ఆధారంగా సీట్లు పెంచితే కేవలం హైదరాబాద్​ లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని.. చివరకు రేవంత్​ రెడ్డి పోటీ చేయడానికి కొండంగల్ నియోజకవర్గం కూడా ఉండదంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్​ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోకపోతే తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య 50 శాతం పెరిగేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల వల్లే నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది అని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>