కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై పంచులు వేశారు. రెండేళ్లు గడిచినా ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా శనివారం శంషాబాద్ లో నిర్వహించిన ఓ కంపెనీ ప్రారంభోత్సవంలో యాంకర్.. సీఎం రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా.. సీఎం దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని పిలిచిందని ఆయన (KTR) గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డిని యాంకర్లు, యాక్టర్ పట్టించుకోవడం లేదని.. ప్రజలు కూడా ఆయన పేరు చెబితే ముఖం చాటేస్తున్నారన్నారు. రేవంత్ ను ఎవరూ దేకడం లేదని.. గుర్తింపు కోసం ఆయన తహతహలాడుతున్నాడన్నారు. మూడు, నాలుగు ఫీట్లు ఉన్నోళ్లు కూడా మాజీ సీఎం కేసీఆర్ ను తిడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు, కంపెనీలను రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్లు చేసి ప్రారంభిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

