epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీలో 28 జిల్లాలు.. 82 రెవెన్యూ డివిజన్లు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​లో జిల్లాల పునర్విభజన పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు (New Districts Formation) సంబంధించి అధికారులు తుది నోటిఫికేషన్​ విడుదల చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం, మార్కాపురం హెడ్​ క్వార్టర్​ గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రేపటి (బుధవారం) నుంచి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts Formation) అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్​ వెలువడింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య, రెండు జిల్లాలు పెరగడంతో ఆ సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అలాగే, రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు అవతరించాయి. వీటిలో అడ్డరోడ్డు జంక్షన్​, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 82 రెవెన్యూ డివిజన్​ లు కానున్నాయి. మండలాల సరిహద్దులు మార్చడంతో 681 మండలాలు కానున్నాయి.

Read Also: ఇంద్రకీలాద్రిపై కీలక సంస్కరణలు..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>