Mobile Popup Ad
Mobile Popup Ad

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పోచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీమణి పుష్పతో పాటు కుమారులు డా. రవీందర్ రెడ్డి – డా. రాధిక దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి – సోని రెడ్డి దంపతులు, మనవరాళ్లు, మనుమలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>