epaper
Monday, January 26, 2026
spot_img
epaper

రిపబ్లిక్​ డే అలర్ట్​.. 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

కలం, వెబ్ డెస్క్​ : రిపబ్లిక్​ డే వేళ పేలుడు పదార్థాల పట్టివేత (Explosives Seized) కలకలం రేపింది. రాజస్థాన్​ (Rajasthan)లోని నాగౌర్​ లో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత సమాచారం ఆధారంగా నాగౌర్​ ఎస్వోటీ పోలీసులు ఆదివారం నిందితుడి సులేమాన్​ ఖాన్ (58)​ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీ పేలుడు పదార్థాలను కనుగొన్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు.

నాగౌర్​ ఎస్పీ వివరాల ప్రకారం.. 187 కాటన్లలో నిల్వచేసిన 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్, తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు, 24 కట్టల విక్ వైర్ తో పాటు మరిన్ని పేలుడు పదార్థాలను సులేమాన్​ తన పొలంలో దాచిపెట్టాడు. కాగా, నిందితుడిపై ఇప్పటికే మూడు పేలుడు పదార్థాల కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం పెద్ద కుట్ర లో భాగం కావొచ్చని అనుమానిస్తున్నారు.

Read Also: చొర‌బాటుదారుడిని హ‌త‌మార్చిన బీఎస్ఎఫ్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>