కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితి మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కనీస వసతులకూ నోచుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకావడం లేదు. కనీసం బిందెడు నీళ్ల (Drinking Water) కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ’దాహమో రామచంద్రా‘ అంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. నేటికీ బావులపై ఆధారపడుతూ దాహర్తీని తీర్చుకుంటున్నారంటే ట్రైబల్ ఏరియాల్లో నీటి కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఎండలు దంచికొడుతుండటంతో ములుగు (Mulugu) జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్ గూడెంలో తాగునీటి కష్టాలు గిరిజనుల ప్రాణాలకు పరీక్షగా మారాయి. చుక్క నీరు దొరకని దుస్థితి నెలకొనడంతో దాహార్తిని తీర్చుకోవడానికి గూడెంకు చెందిన గుత్తి కోయ గిరిజనులు 20 రోజులుగా స్వయంగా ఓ బావిని తవ్వుతున్నారు. ప్రాణాలకు తెగించి సుమారు 30 అడుగుల లోతు వరకు తవ్వుకున్నారు. చుక్క నీరు పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న వేళ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. వెంటనే శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, లేదంటే తమ మనుగడ కష్టమవుతుందని గూడెం వాసులు అధికారులను కోరుతున్నారు.
తాగునీటి కోసం బావిని తవ్విన గ్రామస్తులు
-ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీటి కష్టాలు
-గ్రామ పంచాయతీ అధికారులకు తాగునీటి కోసం ఎన్ని సార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో 3 నెలలుగా కష్టపడి బావిని తవ్వుకున్న గ్రామస్తులుVillagers digging a well for drinking… pic.twitter.com/wtqEkrUQiO
— Kalam Daily (@kalamtelugu) April 6, 2026
Read Also: నేను విదేశీ ప్లేయర్నా?: వైరల్ జోక్స్పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్
Follow Us On : WhatsApp

