వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital) సూపరింటెండ్ కిషోర్ కుమార్పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలెండర్ అమర్చిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరంగల్ ఎంజీఎంలో జరిగిన ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) ఆరా తీసి.. చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే సూపరింటెండ్ కిషోర్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు.
Read Also: అదానీ గ్రూప్లో పెట్టబడులపై LIC క్లారిటీ..

