కలం, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ (Visakhapatnam) పోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోర్టు అథారిటీ ట్రక్ పార్కింగ్ టెర్మినల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ లో ఉన్న లారీ క్యాబిన్లో సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

