Mobile Popup Ad
Mobile Popup Ad

వారసత్వ సంపదపై అవగాహన ఉండాలి : డైరెక్టర్ నాగలక్ష్మి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిల్లలమర్రి (Pillalamarri) వద్ద జిల్లా పర్యాటక శాఖ, DTO, వారసత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పిల్లల మర్రి లోపల పరిసర ప్రాంతాలను శుభ్ర పరిచే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారసత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, పిల్లల మర్రి మ్యూజియం సిబ్బంది, జిల్లా పర్యాటక శాఖ సిబ్బంది, టూరిజం సిబ్బంది పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వారసత్వ కట్టడాల సంరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వారసత్వ ప్రదేశాల పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>