తెలంగాణలోనూ ‘రోహిత్ వేముల చట్టం‘

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థల్లో కుల‌ వివ‌క్ష‌ను నియంత్రించేందుకు రోహిత్ వేముల చ‌ట్టం (Rohith Vemula Act) తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తున్నది. తాజాగా ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  మంత్రివ‌ర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌ వ్యవహరించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన విధి విధానాలను ప్రభుత్వం ఆమోదించనున్నది.

Read Also: ఉద్యోగులకు భారీ షాక్.. శాలరీ కటింగ్స్ కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Us On: Instagram

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>