కలం, వెబ్ డెస్క్ : ప్రేమలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ‘నాన్న జాగ్రత్త’ అంటూ తన చేతిపై రాసుకుని అంతిమ సందేశాన్నిచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం (Prakasam) జిల్లా మార్కాపూరంలోని పామూరు మండలం అయ్యవారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.మాధవి డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠాశాలలో టీచర్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో నాగూర్ భాషా అనే వ్యక్తితో ప్రేమ ఏర్పడింది. అయితే, భాషాకు అప్పటికే పెళ్లి అయిందని తెలుసుకున్న మాధవి అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది.
దీంతో నాగూర్ భాషా యువతితో దిగిన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. ఈ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక ఆదివారం రాత్రి మాధవి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ కు ముందు తన చేతిపై ‘నాన్న జాగ్రత్త’ అంటూ రాసుకోవడం అందరినీ కలిచివేసింది. మాధవి ఆత్మహత్యకు కారణమైన నాగూర్ భాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై సమచారం అందుకున్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జిల్లా (Prakasam) లో విషాదాన్ని నింపింది.

