కలం, వెబ్డెస్క్: వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పులు పలు ప్రాంతాల్లో నష్టాన్ని మిగిల్చాయి. బాపట్ల (Bapatla) జిల్లా చీరాల (Chirala) లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ భారీ గాలులకు పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. గమినించిన ఇంటి సభ్యులు అప్రమత్తమై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అంతే కాకుండా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని థామస్ పేటలో కొబ్బరి చెట్లపై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.
Read Also: మహానాడు మొత్తం జగన్ నామ స్మరణే: శ్యామల
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

