కలం, వెబ్ డెస్క్ : ఘాజియాబాద్లోని (Ghaziabad) కౌశాంబీ పోలీస్ స్టేషన్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో భారీ మొత్తంలో నకిలీ పనీర్ను (Paneer) స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాదాపు 10 క్వింటాళ్ల నకిలీ పనీర్ను పట్టుకున్నారు. మార్కెట్లో దీని విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
సమాచారం ప్రకారం, ఈ నకిలీ పనీర్ను ఉత్తర ప్రదేశ్లోని (Uttar Pradesh) అమ్రోహా జిల్లా ఢబార్సీ గ్రామం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల సరఫరా జరుగుతోందన్న అనుమానంతో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ముందుగానే నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిర్వహించిన చెకింగ్లో ఈ భారీ అక్రమ రవాణా బయటపడింది. పరిశీలన అనంతరం ఫుడ్ సేఫ్టీ విభాగం ఆ పనీర్ను పూర్తిగా అసురక్షితంగా ప్రకటించింది. అనంతరం జేసీబీ సహాయంతో మొత్తం పనీర్ను ధ్వంసం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పనీర్ మార్కెట్కు చేరి ఉంటే వేలాది మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేదని హెచ్చరించారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, కల్తీ పనీర్ తినడం వల్ల కడుపు, కాలేయం సంబంధిత తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారం తీసుకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి అశుతోష్ రాయ్ మాట్లాడుతూ.. 10 క్వింటాళ్ల పనీర్ ద్వారా సుమారు 6 నుంచి 7 వేల మందికి ఆహార పదార్థాలు చేరే అవకాశముందని చెప్పారు. సమయానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రస్తుతం పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తూ, ఈ నకిలీ పనీర్ సరఫరా ఎక్కడెక్కడ జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Read Also: ప్రేయసిని కలవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫిట్నెస్ ట్రైనర్
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

