epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి(MLA Bhoopathi Reddy)కి సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం ఆయన ధర్పల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను స్థానికులు ముట్టడించి నిరసన తెలిపారు.

“గత 30–40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న మా పేర్లు జాబితాలో లేవు. ఎవరికో తెలియని వారికి ఇండ్లు ఎలా కేటాయిస్తారు?” అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. అర్హులైన పేదల పేర్లను జాబితా నుంచి తొలగించి, కాంగ్రెస్ నాయకుల సిఫారసుతో ఇతరులకు ఇండ్లు కేటాయించినట్లు ఆరోపించారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించారు.

కాంగ్రెస్ నేతలు అక్రమంగా తమ అనుచరులకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలకు, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “సానుభూతితో ఓటు వేసి గెలిపించాం. కానీ పేదల హక్కును ఈయన హరించేస్తున్నాడు” అంటూ అడ్డుకున్నారు.

పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపుచేశారు. భారీ ఎత్తున బందోబస్తు మధ్య ఎమ్మెల్యే భూపతి రెడ్డి(MLA Bhoopathi Reddy) అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేపడుతోంది. అయితే కేటాయింపు జాబితా రూపొందించే ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, రాజకీయ జోక్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read Also: కవిత.. గౌరవాన్ని కాపాడుకో: నిరంజన్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>