epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడిగడ్డ డ్యామేజీకి కారణం బ్లాస్టింగే – హరీశ్‌రావు

మానేరు వాగుమీద ఒక చెక్ డ్యామ్‌ను ఇసుకు మాఫియాకు చెందిన వ్యక్తులు బ్లాస్టింగ్ చేసి ధ్వంసం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామాల మధ్య సుమారు రూ. 23 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్‌(Maneru Check Dam)ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పేలుడు పదార్ధాలతో ధ్వంసం చేశారు. త్వరలో ఈ చెక్ డ్యామ్ ప్రారంభం కావాల్సి ఉన్నది. ఘటనా స్థలాన్ని సందర్శించిన సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కూడా డ్యామేజీ అయిందని, అక్కడ కూడా ఇలాంటి బ్లాస్టింగ్ జరిగినట్లు అనుమానం ఉందన్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, మూడు బ్యారేజీలకు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ) డ్యామేజీ జరగడం, నిర్మాణ లోపాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తప్పుపట్టింది.

అది ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది. సీబీఐ దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులోనే కేంద్ర హోం శాఖకు పంపింది. ఇప్పటివరకు సీబీఐ దర్యాప్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు. ఇలాంటి దశలో హరీశ్‌రావు(Harish Rao) కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడానికి బ్లాసింగే కారణమనే వ్యాఖ్య చేయడం సరికొత్త వివాదానికి దారితీసినట్లయింది.

Read Also: కవిత.. గౌరవాన్ని కాపాడుకో: నిరంజన్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>