కలం, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన కేరళం (Keralam) పర్యటనలో భాగంగా బాలూస్సేరిలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తిని కలిశానని, యూడీఎఫ్ (UDF) నాయకులను చూసి ఆయన సంతోషంగా లేరని రాహుల్ పేర్కొన్నారు. దీనికి కారణం యూడీఎఫ్ ప్రకటించిన ‘ఉమెన్ చాందీ ఆరోగ్య బీమా పథకం’ అని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తామని, దీని వల్ల కేరళంలో మరణాల రేటు తగ్గి యమధర్మరాజుకు పని లేకుండా పోతుందంటూ సరదాగా తన పోస్టులో రాసుకొచ్చారు.
కేరళంలోని ఏ కుటుంబం కూడా వైద్య ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్నదే తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. అనారోగ్యం వల్ల ఏ కుటుంబం కూడా తమ గౌరవాన్ని, పొదుపును లేదా భవిష్యత్తును కోల్పోకూడదని ఆయన ఆకాంక్షించారు. వైద్యం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, ప్రతి కేరళం పౌరుడికి ఈ హక్కును చేరువ చేయడమే యూడీఎఫ్ సంకల్పమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేరళంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ భారీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
-కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ వినూత్న ప్రచారం
-'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా పథకం' ప్రవేశ పెట్టిన యూడీఎఫ్
-ఈ ప్రచారంలో భాగంగా అలరించిన యమధర్మరాజు వేషధారణ
-ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల భారీ ఆరోగ్య కవరేజీని అందించే ఈ పథకంతో మరణాల రేటు తగ్గుతుందని, తద్వారా యమధర్మరాజుకు పని ఉండదని… pic.twitter.com/bkZ9cxUDvq— Kalam Daily (@kalamtelugu) April 1, 2026
Read Also: కిషన్ రెడ్డికి ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: X(Twitter)

