ఢిల్లీ ఘటనపై మోడీ స్పందన ఇదే..

రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్న బాంబు(Delhi Blast) దాడి దేశవ్యాప్తంగా భయభ్రాంతిని సృష్టించింది. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఆమోదించబోమని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను, భద్రతకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయని మోడీ(PM Modi) చెప్పారు. దాడికి గల కారణాలు, నిందితుల సంబంధాలు, వారి చర్యల వెనుక ఉన్న ప్రేరణలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే, ప్రజలకు పూర్తి సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భద్రతా పరిస్థితులను పునర్విన్యాసం చేయడం, నగరంలో పౌరుల భద్రతను పెంపొందించడం కోసం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

Read Also: ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి గుర్తింపు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>