కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీ (PM Modi), హోం మంత్రి అమిత్ షాల (Amit Shah) వల్లే తాను బతికి ఉన్నానని బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ (Nupur Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన తెలిసిందే. అనంతరం పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. నాలుగు సంవత్సరాల తరువాత శనివారం సేవ భారతి ఢిల్లీ విభాగం నిర్వహించిన మహిళా సదస్సులో నుపుర్ శర్మ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా తాను అనుభవించిన కష్టాలను ఆమె వివరించారు. నాలుగేళ్లుగా స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నానని చెప్పారు. దేశ నాయకత్వం అందించిన మద్దతు, రక్షణ కారణంగానే సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
‘నా కంటే బాధాకరమైన జీవితాన్ని ఏ సోదరి కూడా అనుభవిస్తుందని అనుకోను. స్వేచ్ఛను కోల్పోయి నాలుగేళ్లు అయింది. కానీ నేను సజీవంగా, సురక్షితంగా ఉన్నానంటే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కారణం. వారి మద్దతు లేకపోతే నేను, నా కుటుంబం జీవించి ఉండేది కాదు’ అని నుపుర్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా, మే 2022లో ఓ మీడియా ఛానల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్బంలో నుపుర్ శర్మకు (Nupur Sharma) మద్దతు తెలిపిన కన్హయ్య లాల్, ఉమేశ్ కోలే హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.
Read Also: ఆకాశంలో అద్భుతం.. 104 మంది స్కైడైవర్ల ప్రపంచ రికార్డ్!
Follow Us On: Instagram

