కలం, వెబ్డెస్క్ : రాజస్థాన్ లో రాకాసి ఇసుక తుఫాన్ (Rajasthan Sandstorm) బీభత్సం సృష్టించింది. ఆకాశాన్ని మింగేస్తున్నట్లు వచ్చిన ఇసుక తుఫాన్ కారణంగా శ్రీ గంగానగర్, చురు, బికనీర్ జిల్లాల్ జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇసుక తుఫానుకు తోడు వడగళ్ల వానలు అతలాకుతలం చేశాయి. బలమైన గాలుల వల్ల రవాణాకు అంతరాయం ఏర్పడి, అనేక ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
శ్రీ గంగానగర్లోని పలు ప్రాంతాల్లో వర్షం, వడగళ్లతో కూడిన భారీ ధూళి తుఫానులు సంభవించాయి. చురు జిల్లాను భారీ ఇసుక తుఫాను కమ్మేయడంతో పగటిపూట ఆ ప్రాంతం అంతా చీకటితో కమ్ముకుపోయింది.

