లక్కీ డ్రాప్​ కోసం గొడవ.. స్నేహితుడి హత్య

కలం, వెబ్​ డెస్క్​ : మందు బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్స్​ కోసం జరిగిన గొడవలో స్నేహితుడినే హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం (Bommalaramaram) మండలం మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం ఈనెల 22న చరణ్​, నవీన్​, మధు అనే ముగ్గురు స్నేహితులు మద్యం పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఫుల్​ బాటిల్ తాగేశారు. బాటిల్లో మిగిలిన చుక్కులు (లక్కీ డ్రాప్స్​) తనకు పోయకుండా చరణ్​, నవీన్​ ఇద్దరే తాగేశారని మధు వారిపై దాడి చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న చరణ్​, నవీన్​ మధుపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని సమీపంలోని ఓ ముళ్ల పొదల్లో పడేశారు. అనంతర విషయం తెలుసుకున్న చరణ్​ తల్లి పోలీసులకు సమచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>