కలం, వెబ్డెస్క్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ (Shamshabad) సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సిరిసిల్ల జిల్లా వాసులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం పరామర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు.

