కలం, వెబ్డెస్క్: ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత వినోద్ కుమార్ శుక్లా (Vinod Kumar Shukla) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్పూర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఈ మేరకు ఆయన కుమారుడు శాశ్వత్ శుక్లా వెల్లడించారు. కాగా, హిందీ సాహిత్య సీమలో వినోద్ కుమార్ శుక్లా(89) శిఖర సమానుల్లో ఒకరు. ఆయన రాసిన నౌకర్ కీ కమీజ్, ఖిలేగా తో దేఖేంగే, ఏక్ చుప్పీ జగహ్, దివార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ, పచీస్ కవిత రచనలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను ఈ ఏడాదే ఆయనకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఙానపీఠ్ లభించింది. నవంబర్ 21న ఆయన నివాసంలోనే ఈ అవార్డును అందించారు. కాగా, వినోద్ కుమార్ శుక్లా మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘వినోద్ కుమార్ మరణం అత్యంత బాధాకరం. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఓం శాంతి”అని తన ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు.


