కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 31,606 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow Us On: Instagram

