epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నేపాల్​లో ఆందోళనలు.. భారత సరిహద్దు మూసివేత

కలం, వెబ్​డెస్క్​: పొరుగు దేశం నేపాల్​ (Nepal) లో మంగళవారం ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దుకు సమీపంలోని ధనుశా జిల్లాలో ఓ ప్రార్థన మందిరాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడం ఉద్రిక్తతలకు కారణమైంది. పర్సా, రహౌల్​ తదితర ప్రాంతాల్లో ఓ సామాజిక వర్గం ఆందోళనలకు దిగింది. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గం వాళ్ల ఇళ్ళ​పై దాడులు జరిగాయి. దీంతో గొడవలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ ప్రాంతాలన్నీ సరిహద్దులోనివే కావడంతో భారత్​ అప్రమత్తమైంది. వెంటనే సరిహద్దులను మూసివేసింది. అత్యవసర సర్వీసులకు తప్ప మిగిలిన అన్ని రాకపోకలపై నిషేధం విధించింది. కాగా, ఇప్పటికే మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్​లో భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాలో అల్లరి మూకలు హిందువులపై దాడులకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేపాల్ (Nepal)​ లోనూ మతపరమైన ఆందోళనలు చెలరేగడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read Also: యూకేలో అమెరికా దళాలు.. టార్గెట్​ ఇరాన్​?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>