Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటలు!

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) తిరుపతి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 84,220 భక్తులు దర్శించుకోగా.. 40,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 3.99 లక్షలు లడ్డులను విక్రయించినట్లు టీటీడీ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>